పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ
Election Commission: పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.
Election Commission: పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఫాం 13ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని ఈసీ తెలిపింది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే అటెస్టేషన్ అధికారి ఫాం 13ఏపై సంతకం చేశారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు లేఖ రాశారు.