AP News: ఏపీకి చేరుకున్న సీఎం జగన్
AP News: 11 గంటలకు పార్టీ కీలక నేతలతో సమావేశం
AP News: లండన్ పర్యటన ముగించుకున్న సీఎం జగన్.. తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్లో సీఎం జగన్కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లికి చేరుకున్న సీఎం.. 11 గంటలకు పార్టీ కీలక నేతలతో కార్యాలయంలో భేటీ కానున్నారు. కౌంటింగ్పై పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు.