మీడియాపై దాడి కేసులో అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఆరుగురు రైతులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. రాత్రి నిద్రపోతుంటే వెళ్లి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమంలో కీలకంగా ఉన్న వారిని భయపెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
అంతకుముందు మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు టీడీపీ నేతలు జైలులో రైతులను పరామర్శించారు. రైతుల అరెస్టులకు నిరసనగా జైలు ముందు టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. రైతులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.