గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా లేఖపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాజకీయాల నుండి విరమించుకున్నంత మాత్రాన... ప్రతీకారదాడులు ఆగవని.. వారి ఉద్యోగుల పక్షపాత వైఖరిలో మార్పు ఉండదన్నారు చంద్రబాబు. వంశీపై కేసులు నిరుపేదలకు ఇల్లు పట్టాలు ఇప్పించే విషయంలోనేనన్నారు. వ్యక్తిగతంగా తాను, తెలుగుదేశంలో పార్టీ యావత్తు ఈ విషయంలో నీ వెంట ఉంటామని వంశీకి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇలాంటి దాడులను ఐకమత్యంగా ఎదుర్కోవాలే కానీ... రాజకీయాల నుండి విరమించుకోవడం పరిష్కారంకాదన్నారు.