అమరావతి రాజధాని నిర్మాణం ప్రణాళికపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతుల పరిరక్షణ సమితి పేరుతో న్యాయవాది అంబటి సుధాకర్ పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు తీసుకున్నారని ఇప్పుడు మళ్లీ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై కమిటి సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు. నిపుణుల కమిటి జీవోను రద్దు చేయాలని పిటిషన్ కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.