Schools Reopen: ముగిసిన వేసవి సెలవులు, నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
సెలవులకు టాటాచెప్పి బడిబాట చెప్పిన స్టూడెంట్స్
Schools Reopen: తెలంగాణలో సమ్మర్ హాలీడేస్ తర్వాత పాఠశాలలు ఇవాళ్టి నుంచి తెరుచుకున్నాయి. సెలవులకు టాటా చెప్పిన విద్యార్థులు దాదాపు 48 రోజుల తర్వాత బడి బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు బడి బాట పట్టారు. సెలవుల తర్వాత స్కూళ్లకు వెళ్లిన విద్యార్థులకు పాఠశాల కమిటీలు స్వాగతం పలికాయి. తొలి రోజే స్టూడెంట్స్కు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు పంపిణీ చేయనున్నారు. కాగా సర్కార్ బడుల్లో విద్యార్థుల చేరికలను ప్రోత్సహించేందుకు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. జూన్ 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.