Nandyal: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
Nandyal: ప్రమాదంపై ఆరా తీస్తున్న పోలీసులు
Nandyala: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెయింటింగ్ పని ముగించుకుని ముగ్గురు యువకులు డోన్నుండి వెళ్తుండగా వర్షంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. జోరు వర్షంలో డివైడర్ను బైక్ ఢీ కొనడంతో ప్రమాదం జరిగిందా..? లేక ఎదైనా వాహనం ఢీకొని వెళ్లిపోయిందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.