Narendra Modi: లోక్‌సభ ఎంపీలకు మంత్రులను పరిచయం చేసిన మోడీ

Narendra Modi: నిర్మలా, ధర్మేంద్ర, అశ్విని వైష్ణవ్‌ను పరిచయం చేసే... సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల నినాదాలు

Update: 2024-06-26 10:49 GMT

Narendra Modi: లోక్‌సభ ఎంపీలకు మంత్రులను పరిచయం చేసిన మోడీ

Narendra Modi: స్పీకర్ ఓం బిర్లా సూచన మేరకు కేంద్ర మంత్రులను... ప్రధాని మోడీ సభకు పరిచయం చేశారు. కేంద్ర మంత్రులు, స్వతంత్ర మంత్రులు, సహాయ మంత్రులను లోక్‌సభ ఎంపీలకు ఒక్కొక్కరిగా సభకు మోడీ పరిచయం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిచయం సమయంలో ఇండియా బ్లాక్ సభ్యులు స్లోగన్స్ ఇచ్చారు. ఇక నీట్ అంశం దేశవ్యాప్తంగా రచ్చ జరగడంతో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఇంట్రడ్యూస్ చేసేప్పుడు విపక్షాలు షేమ్ అంటూ నినదించారు. మరోవైపు ఈ మధ్యే చోటుచేసుకున్న రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను పరిచయం చేసేప్పుడు ఇండియా కూటమి ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags:    

Similar News