Telangana Union Cabinet: నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్
ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ
Telangana Union Cabinet: కేంద్ర మంత్రులుగా తెలంగాణకు చెందిన ఇద్దరు నేతలు ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. బొగ్గు, గనుల మంత్రిగా కిషన్ రెడ్డి 11 గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకుముందు తెలంగాణ భవన్కి వెళ్లి అక్కడే ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అనంతరం గురుద్వారా బంగ్లాసాహిబ్ను సందర్శిస్తారు. ఆ తర్వాత శాస్త్రి భవన్ ఏ బ్లాక్లో ఉన్న బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ సైతం ఇవాళే బాధ్యతలు స్వీకరించనున్నారు. హోంశాఖ కార్యాలయంలో ఉదయం 10 గంటల 35 నిమిషాలకు బండి బాధ్యతలు తీసుకోనున్నారు.