ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్‌కు నోటీసులు

KCR: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది.

Update: 2024-06-11 08:19 GMT

ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్‌కు నోటీసులు

KCR: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై పవర్‌ కమిషన్ వివరణ కోరింది. ఎన్నికల దృష్ట్యా జులై 30 వరకు సమయం కోరారు కేసీఆర్. కాగా జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు పంపించారు. ఇప్పటివరకు 25 మందికి నోటీసులు ఇవ్వగా.. అందరూ వివరణ ఇచ్చినట్లు తెలిపారు. అయితే నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతే పవర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News