తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం
Flood Relief Fund: వరదలతో తీవ్రంగా నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర భారీ సాయం ప్రకటించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 3 వేల 300 కోట్ల ఆర్ధిక సహాయం ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
Flood Relief Fund: వరదలతో తీవ్రంగా నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర భారీ సాయం ప్రకటించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 3 వేల 300 కోట్ల ఆర్ధిక సహాయం ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను.. సెంట్రల్ మినిస్టర్ శివరాజ్సింగ్ చౌహాన్ పర్యటించారు.
నీట మునిగిన కాలనీల్లో బాధితులతో మాట్లాడారు. వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నీటమునిగిన పంటల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులను ఆదుకుంటే.. దేవుడికి పూజలు చేసినట్టేనని శివరాజ్సింగ్ చౌహాన్ తెలిపారు. అన్నట్టుగా వరద నష్టాన్ని కేంద్రానికి తెలిపిన వెంటనే కేంద్రం 3 వేల 300 కోట్లు వరద సాయం కింద ప్రకటించింది.