ఏప్రిల్‌ 1న హైదరాబాద్‌లో గో మహాగర్జన

* హిందువులు తరలిరావాలని టీటీడీ బోర్డు సభ్యుడు శివకుమార్ పిలుపు * గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ * అక్రమ కళేబరాలను మూసివేయాలని డిమాండ్

Update: 2021-01-27 10:38 GMT

ఏప్రిల్‌ 1న హైదరాబాద్‌లో గో మహాగర్జన

ఏప్రిల్ 1న హైదరాబాద్‌లో గో మహాగర్జన నిర్వహించనున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు శివకుమార్ వెల్లడించారు. భారీ ఎత్తున నిర్వహించే ఈ బహిరంగ సభకు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా హిందూవులు తరలివస్తు్న్నట్లు తెలిపారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించి, అక్రమ కళేబరాలను మూసివేయాలని టీటీడీ బోర్డు సభ్యుడు డిమాండ్ చేశారు. గోవధను నిషేధించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భాగ్యలక్ష్మి టెంపుల్‌ నుంచి బహదూర్‌పూర్‌ వరకు చేపట్టిన గో మహాయాత్రను విజయవంతం చేసిన హిందువులకు శివకుమార్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. గో రక్షణకు వెళ్తే.. అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. గోవధను నిషేధించాలని హిందువులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేశారు.

Tags:    

Similar News