మూగబోయిన మైకులు

Update: 2020-11-29 12:30 GMT

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఆదివారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. ఇన్నాళ్లు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో భాగ్యనగరం హోరెత్తిపోయింది. ఏ గల్లీకి వెళ్లినా.. ఏ కాలనీలో అడుగుపెట్టినా మైకులు మార్మోగేవి. నాయకుల రాకతో సందడిగా మారేవి ఇక గ్రేటర్‌ లో ఎలక్షన్‌ కోడ్‌ అమలులోకి వచ్చింది. పార్టీల జెండాలతో కళకళలాడిన కాలనీలు ఇప్పుడు చడిచప్పుడు లేకుండా మూగబోయాయి.

Tags:    

Similar News