తెలంగాణలో అమలవుతోన్న ఎన్నికల కోడ్‌.. ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.23 లక్షలు స్వాధీనం

Telangana: మేడ్చల్‌ జిల్లా చెన్నాపురం చౌరస్తాలో వాహన తనిఖీలు

Update: 2023-10-13 08:49 GMT

తెలంగాణలో అమలవుతోన్న ఎన్నికల కోడ్‌.. ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.23 లక్షలు స్వాధీనం

Telangana: తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమలవుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్‌ వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను ఆపేసి సెర్చింగ్‌ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధి చింతలకుంటలో వాహన తనిఖీలు నిర్వహించారు పోలీసులు. అయితే.. ముగ్గురు వ్యక్తుల నుంచి 23 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అటు.. మేడ్చల్‌ జిల్లా చెన్నాపురం చౌరస్తాలోనూ వాహన తనిఖీలు చేపట్టారు. 6 లక్షల రూపాయలు సీజ్‌ చేశారు పోలీసులు.

Tags:    

Similar News