సీఎం రేవంత్రెడ్డితో సీపీఐ, సీపీఎం, TJS నేతల భేటీ
Revanth Reddy: నల్గొండ- ఖమ్మం- వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. చివరి రోజు ప్రచార సరళిపై చర్చ
Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలు భేటీ అయ్యారు. నల్గొండ- ఖమ్మం- వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చివరి రోజు ప్రచార సరళిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, బొంతు రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.