Bandi Sanjay: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న బండి సంజయ్
Bandi Sanjay: ఢిల్లీలో ఈరోజు కేంద్ర సహాయ మంత్రిగా... బాధ్యతలు స్వీకరించనున్న బండి సంజయ్ కుమార్
Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, ఢిల్లీలో ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. బాధ్యతల స్వీకరణకు ముందుగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ఆయన విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆలయ అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. శక్తిస్వరూపిణి అమ్మవారే తనకు శక్తిఅని బండి సంజయ్ కుమార్ అన్నారు.