Bandi Sanjay: మహిళలు, చిన్నారుల భద్రతపై సమాధానమిచ్చిన బండి
Bandi Sanjay: ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన సంజయ్
Bandi Sanjay: మహిళలు, చిన్నారుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు హోంమంత్రి ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. మహిళా భద్రతా కోసం ఏయే కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు. దేశంలో వివిధ పథకాల కింద మహిళల భద్రత కోసం 13 వేల 412 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని బండి సంజయ్ వెల్లడించారు.