Mynampally Rohit: స్వార్థం కోసం రాజకీయాలను వాడుకోవడం మానుకోవాలి
Mynampally Rohit: ప్రభుత్వ, ప్రవేటు ఆస్తులను ధ్వంసం చేసి ప్రజలను భయాందోళనకు గురిచేశారు
Mynampally Rohit: శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే...ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హెచ్చరించారు. మెదక్ పట్టణంలో గాయపడ్డ బీజేవైఎం నాయకులను పరామర్శించారు మైనంపల్లి రోహిత్. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకుడి ఆరోగ్యం గురించి పూర్తి బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మైనంపల్లి రోహిత్. మతసామరస్యాలకు ప్రతీకగా నిలిచిన మెదక్ ప్రాంతంలో...మతచిచ్చులతో కొందరు ప్రజల్లో భయాందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించారని మైనంపల్లి రోహిత్ ఆరోపించారు. స్వార్థం కోసం రాజకీయాలను వాడుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు.