KGBV: వికారాబాద్ కేజీబీవీ స్కూల్లో 26 విద్యార్థినులకు అస్వస్థత

KGBV: వికారాబాద్ జిల్లా నస్కల్‌లోని కేజీబీవీ స్కూల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Update: 2024-06-28 05:36 GMT

KGBV: వికారాబాద్ కేజీబీవీ స్కూల్లో 26 విద్యార్థినులకు అస్వస్థత

KGBV: వికారాబాద్ జిల్లా నస్కల్‌లోని కేజీబీవీ స్కూల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పి, వాంతుల వంటి లక్షణాలతో 26 మంది విద్యార్థినిలు బాధ పడుతున్నారు. దీంతో పాఠశాల సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వేసుకోవడంతో అస్వస్థతకు గురైనట్టు డాక్టర్లు తెలిపారు. సమాచారం అందుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు.

ప్రస్తుతం నలుగురు విద్యార్థినుల పరిస్థితి మాత్రం బాగోలేదని వైద్యులు చెప్పారు. ఆ నలుగురు బాలికలకు ఆస్తమా ఉండడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుున్నారు. ఈ విషయం తెలుసుకుని వారి తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. బాలికల పరిస్థితిపై కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్యులతో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

Tags:    

Similar News