IND vs BAN: టాస్ ఓడిన భారత్.. మ్యాచ్ విన్నర్‌కు బిగ్ షాకిచ్చిన రోహిత్ శర్మ..

India vs Bangladesh 1st Test Toss: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ గురువారం (సెప్టెంబర్ 19) నుంచి ప్రారంభమైంది.

Update: 2024-09-19 05:10 GMT

IND vs BAN: టాస్ ఓడిన భారత్.. మ్యాచ్ విన్నర్‌కు బిగ్ షాకిచ్చిన రోహిత్ శర్మ..

India vs Bangladesh 1st Test Toss: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ గురువారం (సెప్టెంబర్ 19) నుంచి ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు నుంచి కుల్దీప్ యాదవ్‌ను తప్పించి అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ చోటు దక్కించుకున్నాడు.

టాస్ గెలిచిన నజ్ముల్ హొస్సేన్ శాంటో మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. కొంత తేమ ఉంది, దానిని ఉపయోగించాలనుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. పిచ్ కష్టంగా కనిపిస్తోంది, మొదటి సెషన్ ఫాస్ట్ బౌలర్లకు చాలా బాగుంటుంది. ఇది కొత్త సిరీస్. మాకు అనుభవంతో కూడిన సీనియర్లతోపాటు యువతతో కలిసిన మంచి జట్టు ఉంది. ఈ కాంబినేషన్ విషయంలో పెద్దగా మార్పులేమీ లేవని శాంటో తెలిపాడు. పాకిస్థాన్‌తో గత మ్యాచ్‌లో ఉన్న కాంబినేషన్‌ను అలాగే ఉంది.

అదే సమయంలో మేం కూడా ముందుగా బౌలింగ్ చేయడానికి ఇష్టపడతాను అని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇవి సవాలుతో కూడిన పరిస్థితులు కానున్నాయి. మేం బాగా సిద్ధమయ్యాం, మా సామర్థ్యాన్ని విశ్వసించాలి, మాకు తెలిసిన విధంగా ఆడాలి. 10 టెస్టు మ్యాచ్‌లను పరిశీలిస్తే, ప్రతి మ్యాచ్‌ కీలకమే. కానీ, మా ముందు ఉన్న వాటిపై దృష్టి పెట్టాలనుకుంటున్నాం. వారం రోజుల క్రితమే ఇక్కడికి వచ్చాం. దీని కోసం మంచి ప్రిపరేషన్‌ చేశాం. మేం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం అంటూ తెలిపాడు. భారత బౌలింగ్ కాంబినేషన్‌లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లుగా ఆడుతున్నారు.

తొలి టెస్టు మ్యాచ్ కోసం భారత్, బంగ్లాదేశ్‌ జట్ల ప్లేయింగ్ 11 ఇదే..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

బంగ్లాదేశ్: షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహిద్ రాణా.

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ ఫార్మాట్‌లో 2000 సంవత్సరంలో గొడవ ప్రారంభమైందని, అప్పటి నుంచి ఈ రెండు జట్ల మధ్య మొత్తం 13 మ్యాచ్‌లు జరిగాయి. ఈ సమయంలో, టీమ్ ఇండియా పైచేయి సాధించింది. భారత్ 11 మ్యాచ్‌లు గెలుపొందగా, 2 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమిని ఎదుర్కోలేదు. అదే సమయంలో బంగ్లాదేశ్‌కు ఒక్క విజయం కూడా దక్కలేదు. ఏదేమైనా, బంగ్లాదేశ్ తన చివరి టెస్ట్ సిరీస్‌లో స్వదేశంలో పాకిస్తాన్‌ను ఓడించింది. దాని కారణంగా దాని విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. జట్టు తన ప్రదర్శనను కొనసాగించాలని కోరుకుంటుంది. ఈ రెండు జట్లూ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025 రేసులో ఉన్నాయి. అందుకే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లకు చాలా ప్రాముఖ్యత ఉంది.


Tags:    

Similar News