Vande Bharat Express: మళ్లీ వందే భారత్ రైలు ఆగిపోయింది.. మొన్న గేదెలు.. నిన్న ఆవు.. నేడు..

Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వరుస ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి.

Update: 2022-10-08 12:58 GMT

Vande Bharat Express: మళ్లీ వందే భారత్ రైలు ఆగిపోయింది.. మొన్న గేదెలు.. నిన్న ఆవు.. నేడు..

Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వరుస ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. గత రెండు రోజుల్లో ముంబయి-గాంధీనగర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండుసార్లు పశువులను ఢీకొని ఆగిపోగా.. తాజాగా మరో వందే భారత్‌ రైలులో సాంకేతిక సమస్య ఏర్పడింది. శనివారం వారణాసి బయల్దేరిన ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ట్రాక్షన్‌ మోటార్‌ జామ్‌ అవడంతో మధ్యలోనే ఆగిపోయింది. ఈ లోపాన్ని గుర్తించిన రైల్వే గ్రౌండ్ స్టాఫ్ రైల్వే ఆపరేషన్స్ విభాగానికి సమాచారం అందించారు. వరుసగా మూడో రోజు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం పట్ల సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి.

Tags:    

Similar News