Jammu Kashmir Polls: జమ్మూ కశ్మీ్ర్‌లో ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్‌

Jammu Kashmir Polls: ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగం

Update: 2024-09-25 16:00 GMT

Jammu Kashmir Polls: జమ్మూ కశ్మీ్ర్‌లో ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్‌

Jammu Kashmir Polls: జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి లైన్లలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో దశలో ఆరు జిల్లాల పరిధిలోని 26 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్‌ జరిగింది. 25లక్షలమందికిపైగా ఓటర్లు ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు జమ్మూ కశ్మీర్‌లో 54 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా రియాసి జిల్లాలో 71.81 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, శ్రీనగర్‌ జిల్లాలో అత్యల్పంగా 27.31 శాతం ఓటింగ్‌ రికార్డయ్యింది. ఈనెల 18న జరిగిన తొలి దశలో 61.38 శాతం ఓటింగ్ శాతం నమోదైంది.

Tags:    

Similar News