ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం.. 2000 కోట్ల కొకైన్‌ స్వాధీనం

ఢిల్లీ పోలీసుల అదుపులో నలుగురు స్మగ్లర్లు

Update: 2024-10-02 09:48 GMT

ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం.. 2000 కోట్ల కొకైన్‌ స్వాధీనం

Delhi: దేశరాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 2వేల కోట్ల విలువైన 500 కేజీల కొకైన్‌ను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి నలుగురు స్మగ్లర్లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ రాకెట్ వెనుక ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్మింగ్ సిండికేట్ ఉండి ఉంటుందని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు.

ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఆదివారం ఇద్దరు ఆప్ఘాన్ దేశస్తులు 400 హెరాయిన్, 160 గ్రాముల కొకైన్‌తో పట్టుబడ్డారు. అదేరోజు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఒక ప్రయాణికుడి నుండి 1660 గ్రాముల కొకైన్‌ని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లైబేరియాకు చెందిన ఈ ప్రయాణికుడు దుబాయ్ నుండి ఢిల్లీకి కొకైన్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. పట్టుబడిన కొకైన్ విలువ సుమారు రూ. 24.90 కోట్లు వరకు ఉంటుందని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News