Amit Shah: విపక్షాల భేటీపై అమిత్ షా సెటైర్లు.. 2024లోనూ మోడీ ప్రధాని అవుతారని ధీమా

Amit Shah: 300కు పైగా సీట్ల మెజారిటీతో బీజేపీ గెలుస్తుందని జోస్యం

Update: 2023-06-23 13:29 GMT

Amit Shah: విపక్షాల భేటీపై అమిత్ షా సెటైర్లు.. 2024లోనూ మోడీ ప్రధాని అవుతారని ధీమా

Amit Shah: పాట్నాలో జరిగిన విపక్షాల ఐక్యతా భేటీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెటైర్లు వేశారు. అది విపక్షాల భేటీ కాదని.. ఫొటో సెషన్ అంటూ షా ఎద్దేవా చేశారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా.. విపక్షాలపై విరుచుకుపడ్డారు. విపక్షాలన్నీ కలిసినా బీజేపీని ఓడించలేవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2024లో కూడా మోడీనే ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. 300కు పైగా సీట్ల మెజారిటీతో బీజేపీ గెలుస్తుందని షా ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు కలిసి సమావేశమైనా.. ఐక్యంగా ఉండలేవని.. ఎన్నిసార్లు భేటీ అయినా బీజేపీని ఓడించలేవని తేల్చి చెప్పారు అమిత్ షా.

Tags:    

Similar News