Pani Puri : పానీపూరీ తినేవారికి షాకింగ్ న్యూస్..పానీపూరీలో క్యాన్సర్ కారకాలు

Pani Puri : మీకు పానీపూరీ అంటే ఇష్టమా?ప్రతిరోజూ పానీపూరీ తింటున్నారా?అయితే మీకో షాకింగ్ న్యూస్. పానీపూరీ తయారీలో వినియోగించే రంగుల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.

Update: 2024-07-01 03:33 GMT

Pani Puri : పానీపూరీ తినేవారికి షాకింగ్ న్యూస్..పానీపూరీలో క్యాన్సర్ కారకాలు

Pani Puri : మీకు పానీపూరీ అంటే ఇష్టమా?ప్రతిరోజూ పానీపూరీ తింటున్నారా?అయితే మీకో షాకింగ్ న్యూస్. పానీపూరీ తయారీలో వినియోగించే రంగుల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. పలు రకాల ఆహారాల్లో కృత్రిమ రంగులు కలుపుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంల కర్నాటకలో ఆహార భద్రత విభాగం అధికారులు రాజధాని బెంగళూరుతోపాటు 79 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

చాలా పానీపూరీ టెస్టుల్లో వాటి సాస్, స్వీట్ చిల్లీ పౌడర్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు తేలిందని..ది టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. చాలా వరకూ శాంపిళ్లలో సన్ సెట్ యెల్లో , బ్రిలియంట్ బ్లూ, కార్మోసిన్ రంగులు ఉన్నట్లు తేలిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. బెంగళూరులో సేకరించిన 49కి 19 శాంపిళ్లలో సింథటిక్ కలర్స్ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో పానీపూరీ తయారీలో కృత్రిమ రంగులతో తయారు చేసే సాస్ లు, స్వీట్ చిల్లీ పౌడర్లను రాష్ట్రవ్యాప్తంగా నిషేధించే యోచనలో ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఇటీవల గోబీ మంచూరియా, కబాబ్ ల వంటి ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ కర్నాటక ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కృత్రిమ రంగుల వల్ల అలర్జీ, పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, అరుగుదల వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో ఎక్కువ కాలం ఈ సింథటిక్ రంగులను తీసుకోవడం వల్ల క్యాన్సర్ గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News