Health Tips: కిడ్నీ సమస్యలుంటే ఈ ఆహారాలు తినవద్దు.. చాలా ప్రమాదం..!

Health Tips: కిడ్నీ శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. తిన్న ఆహారంలోని చెడు మలినాలని ఇది మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది.

Update: 2023-02-16 05:59 GMT

Health Tips: కిడ్నీ సమస్యలుంటే ఈ ఆహారాలు తినవద్దు.. చాలా ప్రమాదం..!

Health Tips: కిడ్నీ శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. తిన్న ఆహారంలోని చెడు మలినాలని ఇది మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. అయితే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. ఆహారంలో జీర్ణం కావడానికి కష్టంగా ఉండే పదార్థాలు కిడ్నీ సమస్యలని మరింత పెంచుతాయి. ఈ పరిస్థితిలో కిడ్నీ సమస్యలు ఉన్నవారు కొన్ని ఆహారాలకి దూరంగా ఉండాలి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

అరటిపండు

అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల కిడ్నీ సమస్యలు ఏర్పడవచ్చు. మీరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లయితే పొరపాటున కూడా అరటిపండ్లను తినవద్దు. ఎందుకంటే దీనివల్ల సమస్యలు మరింత పెరుగుతాయి.

బంగాళదుంపలు

ఈ రోజుల్లో చాలా మంది బంగాళాదుంపల కూరని ఎక్కువగా తింటారు. కానీ అది తినడం వల్ల కిడ్నీ క్రమంగా క్షీణించడం మొదలవుతుంది. బంగాళదుంపలను తరచుగా మాత్రమే తినాలి. ఎక్కువగా తీసుకోకూడదని గుర్తుంచుకోండి.

టొమాటో

టమోటాలను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే అది మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎందుకంటే టొమాటోలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీలను దెబ్బతీస్తుంది.

పాలు, పెరుగు

కిడ్నీ సమస్యలు ఉన్నవారు పాల ఉత్పత్తులు ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కిడ్నీపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది. దీనివల్ల సమస్య మరింత పెరుగుతుంది.

పప్పులు

పప్పులో అనేక రకాల మూలకాలు ఉంటాయి. కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉంటే పప్పులను ఎక్కువగా తినకూడదు.

Tags:    

Similar News