YS Jagan: వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేతపై జగన్‌ ట్వీట్..

YS Jagan: తాడేపల్లి వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై మాజీ సీఎం జగన్ స్పందించారు.

Update: 2024-06-22 04:59 GMT

YS Jagan: వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేతపై జగన్‌ ట్వీట్..

YS Jagan: తాడేపల్లి వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై మాజీ సీఎం జగన్ స్పందించారు. రాజకీయ కక్షసాధింపులకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారన్నారు. నియంతలా దాదాపు పూర్తి కావొచ్చిన వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయించారని హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారన్నారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం కనుమరుగైపోయాయని దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యలను ఖండించాలన్నారు జగన్. ఇలాంటి బెదిరింపులకు తలొగ్గేదిలేదని ట్వీట్ చేశారు మాజీ సీఎం జగన్.

కాగా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజామున ఐదున్నర గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. శ్లాబ్ కు సిద్ధంగా ఉన్న బిల్డింగ్ ను బుల్డోజర్లు, ప్రొక్లైన్లతో కూల్చివేయించారు. సీఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ నిన్న ఏపీ హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. చట్టాన్ని మీరి వ్యవహరించొద్దని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను సీఆర్డీఏ కమిషనర్ కు అందజేశారు వైసీపీ తరపు లాయర్. అయితే హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారంటూ వైసీపీ లాయర్ ఆరోపించారు. సీఆర్డీఏ అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, ఈ విషయం హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామంటోంది వైసీపీ. 

Tags:    

Similar News