ఇవాళ విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యేల సమావేశం
చంద్రబాబును టీడీపీ పక్షనేతగా ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు
ఇవాళ విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును పార్టీ నేతలు ఎన్నుకోనున్నారు. అనంతరం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. తర్వాత వీరంతా గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. చంద్రబాబును తమ నేతగా ఎన్నుకున్నట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.