Narasapuram: ఎంపీడీఓ మిస్సింగ్.. విషాదాంతం..

Narasapuram: నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది.

Update: 2024-07-23 10:51 GMT

Narasapuram: ఎంపీడీఓ మిస్సింగ్.. విషాదాంతం..

Narasapuram: నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. వెంకటరమణారావు మృతదేహాన్ని ఎస్‌డీఆర్ఎఫ్ బృందం గుర్తించింది. ఏలూరు కాలువలో తూటి కాడ మధ్య మృతదేహం ఇరుక్కుని ఉంది దీంతో పోలీసులు బయటకు తీశారు. గత పాలకుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

సెల్ లొకేషన్ మిస్ అయిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైంది. వెంకటరమణారావు మృతదేహాన్ని ఎస్‌డీఆర్ఎఫ్ బృందం గుర్తించి అధికారికంగా ధృవీకరించింది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని చూసి ఎంపీడీవో కుమారులు, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Tags:    

Similar News