Nimmala Ramanaidu: జగన్‌ హయాంలో నీటి పారుదల శాఖ 20 ఏళ్లు వెనక్కి

Nimmala Ramanaidu: వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవడమే తమ లక్ష్యమని జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Update: 2024-07-10 07:58 GMT

Nimmala Ramanaidu: జగన్‌ హయాంలో నీటి పారుదల శాఖ 20 ఏళ్లు వెనక్కి

Nimmala Ramanaidu: వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవడమే తమ లక్ష్యమని జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ రైట్ కెనాల్‌కు మంత్రి నిమ్మల రామానాయుడు నీళ్లు విడుదల చేశారు. మాజీ సీఎం జగన్ తాగు,సాగునీటి రంగాలను నిర్లక్ష్యం చేశారని మంత్రి నిమ్మల విమర్శలు గుప్పించారు.

గడిచిన ఐదేళ్లలో ఇరిగేషన్ రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ విభజన వల్ల వచ్చిన నష్టం కంటే జగన్ పాలన వల్ల ఇరిగేషన్ రంగానికి వచ్చిన నష్టం ఎక్కువని అన్నారు. పట్టిసీమ వట్టిసీమన్న జగన్, అన్నదాతలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు.

Full View


Tags:    

Similar News