విశాఖ స్టీల్ ప్లాంట్ కు శాశ్వత పరిష్కారం చూపాలి: చంద్రబాబు

రాష్ట్రానికి అవసరమైన నిధుల విడుదల, ఇతర సమస్యలపై చర్చించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని ఆయన చెప్పారు.

Update: 2024-10-08 15:08 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ కు శాశ్వత పరిష్కారం చూపాలి: చంద్రబాబు

Andhra Pradesh chief minister Chandrababunaidu key comments on visakha steel plant

విశాఖ స్టీల్ ప్లాంట్  కు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర మంత్రి కుమారస్వామిని కోరినట్టుగా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. మంగళవారం రాత్రి దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల పాటు దిల్లిలో ప్రధాని మోదీతో పాటు పలువురు మంత్రులను ఆయన కలిశారు. రాష్ట్రానికి అవసరమైన నిధుల విడుదల, ఇతర సమస్యలపై చర్చించారు. దిల్లీ టూర్ వివరాలను ఆయన మీడియాకు వివరించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని ఆయన చెప్పారు. ఈ విషయమై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో మాట్లాడినట్టుగా ఆయన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించిన తర్వాత దీనిపై స్పష్టత వస్తుందన్నారు.

Tags:    

Similar News