Kumaraswamy: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను పరిశీలించిన కుమారస్వామి

Kumaraswamy: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మూతపడుతుందనే ఆందోళన వద్దు

Update: 2024-07-11 14:45 GMT

Kumaraswamy: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను పరిశీలించిన కుమారస్వామి 

Kumaraswamy: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మూతపడుతుందనే ఆందోళన వద్దని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి భరోసా ఇచ్చారు. గురువారం ఆయన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అనేక మంది ఆధారపడి ఉన్నారన్నారు. దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు కుమారస్వామి. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని కేంద్ర మంత్రి కుమారస్వామి తెలిపారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉండదని స్పష్టంగా చెబుతున్నామన్నారు కుమారస్వామి. స్టీల్ ప్లాంట్ మీద ఇక్కడ ప్రజలు, ఉద్యోగుల సెంటిమెంటును తాను గుర్తించానన్నారు.

Tags:    

Similar News