Tirumala: పిఠాపురంలో పవన్కల్యాణ్ గెలవాలని అభిమాని పొర్లుదండాలు
కూటమి ప్రభుత్వం ఏర్పడాలని మొక్కుకున్న అభిమాని
Janasena: తిరుమలలో జనసేన అభిమానం ఎల్లలు దాటింది. హనుమాన్ జయంతి సందర్భంగా పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజారటీతో గెలవాలని.. చంద్రగిరికి చెందిన చిరంజీవి అనే అభిమాని పొర్లుదండాలు పెట్టి.. మొక్కులు చెల్లించుకున్నారు. తనకు టీడీపీ, జనసేన అంటే అభిమానం ఉందని... ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడాలని.. కోరుకున్నట్టు తెలిపారు. దేశంలోనూ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడాలని హనుమాన్ను వేడుకున్నట్టు తెలిపారు.