Prathipati Pulla Rao: వైసీపీ పాలనలో ఆసుపత్రి ప్రారంభానికి నోచుకోలేదు
Prathipati Pulla Rao: చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రి వద్ద పుల్లారావు సెల్ఫీ చాలెంజ్
Prathipati Pulla Rao: పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించి సెల్పీ చాలెంజ్ విసిరారు. 2018లో తాను మంత్రిగా ఉన్న సమయంలో చిలకలూరిపేటలో వంద పడకల ఆసుపత్రికి 19కోట్లు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదని ఎద్దేవా చేశారు. వంద పడకల ఆసుపత్రి కోసం 14మంది వైద్యులు, సిబ్బంది ఉన్నా... వారు కూర్చోవడానికి సౌకర్యాలు లేవన్నారు.