AP News: ఏపీలో ఇసుక సరఫరాకు మార్గదర్శకాలు జారీ

AP News: కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయన్న ప్రభుత్వం

Update: 2024-07-08 10:36 GMT

AP News: ఏపీలో ఇసుక సరఫరాకు మార్గదర్శకాలు జారీ

AP News: ఏపీ ప్రభుత్వం పాత ఇసుక విధానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019, 2021 ఇసుక విధానాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అదే సమయంలో ఉచిత ఇసుకపై విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కొత్త ఇసుక విధానాన్ని రూపొందించే వరకు ఈ విధివిధానాలు వర్తిస్తాయని, రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించింది.

Tags:    

Similar News