Amarnath: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
Gudivada Amarnath: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో వైసీపీ నాయకులు, ఆస్తుల మీద దాడులు పెరిగాయన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.
Gudivada Amarnath: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో వైసీపీ నాయకులు, ఆస్తుల మీద దాడులు పెరిగాయన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తాడేపల్లిలో పార్టీ కార్యాలయం కూల్చివేత, విశాఖ కార్యాలయానికి నోటీసులు.. కేవలం కక్ష సాధింపు చర్యలని విమర్శించారు. ఏపీలో టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న అమర్నాథ్.. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయాన్ని చట్టపరంగా పోరాడి కాపడుకుంటామని స్పష్టం చేశారు.
పైగా చేసిందంత చేస్తూ.. అసెంబ్లీలో నీతులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నామని ఏదైనా చేస్తామంటే పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు వస్తాయి. మీకు వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటున్నారనేది ప్రజలు గమనిస్తున్నారు అని అన్నారాయన.