AP Assembly: ఉభయసభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ ప్రసంగం

AP Assembly: ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్.

Update: 2024-07-22 06:46 GMT

AP Assembly: ఉభయసభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ ప్రసంగం

AP Assembly: ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్.. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడారు. 2014, 2019 మధ్య ఏపీ అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి కృషి చేశారన్నారు.

విభజనతో రాష్ట్రం నష్టపోయిందని.. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంతకుమించిన నష్టం జరిగిందన్నారు గవర్నర్. గాడి తప్పిన రాష్ట్రాన్ని చక్కబెట్టే బాధ్యత సభ్యులపై ఉందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు. మార్పు కావాలని ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉందని గవర్నర్‌ అన్నారు.

Full View


Tags:    

Similar News