Mandipalli Ramprasad Reddy: త్వరలో ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Mandipalli Ramprasad Reddy: ఉచిత బస్సు సౌకర్యంలో లోటుపాట్లు తలెత్తకుండా చూస్తాం

Update: 2024-06-23 11:45 GMT

Mandipalli Ramprasad Reddy: త్వరలో ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Mandipalli Ramprasad Reddy: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే ప్రారంభిస్తామని.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో ఇవాళ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా తనకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారాయన. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. తన శాఖలో ఎక్కడా తప్పులు జరగకుండా శక్తివంచనా లేకుండా కృషి చేస్తానన్నారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి. తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యంలో ఎదురయ్యే లోటు పాట్లు ఏపీలో తలెత్తకుండా చూస్తాన్నామన్నారు.

Tags:    

Similar News