Pinnelli Ramakrishna Reddy: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసుల్లో విచారణ

Update: 2024-07-08 16:30 GMT

Pinnelli Ramakrishna Reddy: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం, రెండు హత్యాయత్నం కేసుల్లో కోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లిని రెండ్రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. పిన్నెల్లిని విచారించేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు... విచారణ సమయంలో వీడియో తీయాలని కోర్టు ఆదేశించింది. గురజాల డీఎస్పీ చుండూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని పోలీసుల బృందం పిన్నెల్లిని విచారిస్తుంది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై దాడి వెనుక ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆయుధాలతో కారంపూడిలో దాడి చేయాల్సి వచ్చిందంటూ పోలీసులు పిన్నెల్లిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇవాళ విచారణ పూర్తికాగా... రేపు మరోసారి పిన్నెల్లిని విచారించనున్నారు.

Tags:    

Similar News