Y S Jagan: ఈ నెల 19న పార్టీ నేతలతో వైసీపీ అధినేత జగన్ కీలక భేటీ
Y S Jagan: ఈ నెల 19న ఉ.10.30 గంటలకు క్యాంపు ఆఫీస్లో భేటీ
Y S Jagan: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీ అధినాయకత్వం.. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈ నెల 19న పార్టీ నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీకి పోటీచేసిన అభ్యర్థులతో పాటు.. పార్లమెంట్కు పోటీచేసిన అభ్యర్థులతో ఆయన భేటీ కానున్నారు. ఈ నెల 19న ఉదయం పదిన్నర గంటలకు క్యాంపు ఆఫీస్లో ఈ సమావేశం జరగనుంది. అయితే.. పార్టీ నేతలకు మాజీ సీఎం జగన్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.