Bandi Sanjay: మరోసారి హాట్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఢిల్లీలో ఒప్పందం జరిగింది

Update: 2024-08-21 15:57 GMT

Bandi Sanjay: మరోసారి హాట్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్‌ దోస్తీ అంటూ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఢిల్లీలో ఒప్పందం జరిగిందన్నారు. అభిషేక్ సింఘ్వీ కవిత బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారన్న బండి సంజయ్.. అందుకోసమే 39 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీకి పోటీ చేయడం లేదన్నారు. అభిషేక్ సింఘ్వి కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కేసీఆర్ చెప్పినట్టుగా వింటోందని ఆరోపించిన బండి సంజయ్.. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌లో కలిశారని తెలిపారు.

Tags:    

Similar News