Bhatti Vikramarka: అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
Bhatti Vikramarka: ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది
Bhatti Vikramarka: నల్గొండ జిల్లాలోని దామరచర్ల పవర్ ప్లాంట్పై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కూడా పాల్గొన్నారు. భూ నిర్వాసితులకు సత్వరమే పరిహారం చెల్లించాలని భట్టి.. అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. 2025 మార్చి కల్లా పవర్ ప్లాంట్లో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి టార్గెట్ను చేరుకోవాలని సూచించారు భట్టి విక్రమార్క.