Group 1 Exams: నేటి నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌.. పరీక్షా పేపర్ల తరలింపులో తొలిసారిగా జీపీఎస్ ట్రాకింగ్

Group 1 Mains Exams: తెలంగాణలో ఇవాళ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరగనుంది.

Update: 2024-10-21 01:36 GMT

Group 1 Exams: నేటి నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌.. పరీక్షా పేపర్ల తరలింపులో తొలిసారిగా జీపీఎస్ ట్రాకింగ్

Group 1 Mains Exams: తెలంగాణలో ఇవాళ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరగనుంది. నేటి నుంచి ఈనెల 27 వరకు పరీక్షలు నిర్వహించనుంది ప్రభుత్వం. 563 పోస్టులకు గాను 31 వేల 382 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు తొలి పరీక్ష జరగనుంది. గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 46 పరీక్ష కేంద్రాలను సన్నద్ధం చేశారు.

గ్రూప్ 1 అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానంలో పరీక్షను నిర్వహించనుంది TSPSC. జీవో 29 రద్దు చేయాలని అభ్యర్థుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. పరీక్షా పేపర్ల తరలింపులో తొలసారి జీపీఎస్ ట్రాకింగ్ విధానాన్ని వినియోగించనుంది TSPSC.

Tags:    

Similar News