మోడీకి కేసీఆర్ వెల్‌కమ్ చెప్పకపోవడానికి రీజన్!

Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన మరోసారి టీఆర్ఎస్ బీజేపీ మధ్య పొలిటికల్ హీట్‌ పుట్టిస్తోంది.

Update: 2022-05-25 12:30 GMT

మోడీకి కేసీఆర్ వెల్‌కమ్ చెప్పకపోవడానికి రీజన్!

Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన మరోసారి టీఆర్ఎస్ బీజేపీ మధ్య పొలిటికల్ హీట్‌ పుట్టిస్తోంది. సమతామూర్తి విగ్రహావిష్కరణ సమయంలో ప్రధాని వచ్చినప్పుడు కేసీఆర్ స్వాగతం పలకకపోవడం రాజకీయ దుమారం చెలరేగింది. మళ్లీ రేపు హైదరాబాద్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తుండగా ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులో ఉండటం లేదనే టాక్ వస్తోంది.

ప్రధానమంత్రికి స్వాగతం చెప్పేందుకు మంత్రి తలసానికి బాధ్యతలు అప్పజెప్పడంతో కేసీఆర్ వెళ్లరనే విషయం ఖాయమైపోయింది. పైగా ప్రధానమంత్రి పర్యటన రోజే సీఎం కేసీఆర్ కర్నాటక టూర్ ఫిక్స్ చేసుకున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ, కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ చీఫ్‌ కుమారస్వామితో కేసీఆర్ భేటీ కానున్నారు. కేంద్రంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటు కోసం జట్టు కడుతున్న కేసీఆర్ జాతీయ పర్యటనలు తెలంగాణలో రాజకీయ చర్చకు తెరలేపుతున్నాయి.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..

Full View


Tags:    

Similar News