తెలంగాణాలో కొత్తగా 1,863 పాజిటివ్ కేసులు..

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

Update: 2020-08-15 04:04 GMT
Representational Image

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(శుక్రవారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,863 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 90,259కి చేరింది. మృతుల సంఖ్య 684కి పెరిగింది. సోమవారం ఒక్క రోజే 1,912 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 66,169కి చేరింది. ప్రస్తుతం 23,379 మంది చికిత్స పొందుతున్నారు. నిన్నఒక్కరోజే 21,239 మంది నమూనాలను పరీక్షించగా 1,863 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 394, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరిలో 175, రంగారెడ్డి జిల్లాలో 131, క‌రీంన‌గ‌ర్లో 104, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 101, రాజ‌న్న సిరిసిల్ల 90, సంగారెడ్డి 81, ఖ‌మ్మం 61, , జ‌గిత్యాల 61, సిద్దిపేట 60, గ‌ద్వాల జిల్లాలో 58, న‌ల్ల‌గొండ 49, వ‌రంగ‌ల్ రూర‌ల్ 41, పెద్ద‌ప‌ల్లి 40, నిజామాబాద్ 39, కొత్త‌గూడెం 36, మెద‌క్ 36, జ‌న‌గామా 34, సూర్యాపేట 33, కామారెడ్డిలో 31, నిర్మ‌ల్ 28, వ‌న‌ప‌ర్తి 26, నాగ‌ర్ క‌ర్నూల్ 24, ఆదిలాబాద్‌లో 18, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 18, వికారాబాద్ 16, యాదాద్రి భువ‌న‌గిరి 15, మ‌హ‌బూబాబాద్ 14, ములుగు 13, ఆసిఫాబాద్ 12, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లిలో 12, మంచిర్యాల 7, నారాయ‌ణ‌పేట 5 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది ప్రస్తుతం రికవరీ రేట్ 72.72గా ఉంది. దేశంలో 70.76గా రికవరీ రేట్. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు.. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.76 శాతంగా ప్రభుత్వం చెప్పింది. దేశంలో అది 1.99 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. 




 

Tags:    

Similar News