KTR: సింగరేణి సంస్థను అమ్మేందుకు కేంద్రం కుట్ర

KTR: సింగరేణిని అమ్మేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు

Update: 2024-06-20 13:15 GMT

KTR: సింగరేణి సంస్థను అమ్మేందుకు కేంద్రం కుట్ర

KTR: తెలంగాణ బొగ్గు గనుల వేలంపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది. సింగరేణి సంస్థను అమ్మేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో బొగ్గు గనులు వేల వెయవద్దని గతంలో మోడీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. 16 ఎంపీ సీట్లు వచ్చిన టీడీపీ..విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు 16 ఎంపీ సీట్లిస్తే...హైదరాబాద్‌లోనే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బొగ్గు గనులను వేలం వేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News