Bonalu 2024: భాగ్యనగరంలో బోనాల సంబురాలు

Bonalu 2024: నెత్తిన బోనాలతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్న మహిళలు

Update: 2024-07-14 08:45 GMT

Bonalu 2024: భాగ్యనగరంలో బోనాల సంబురాలు

Bonalu 2024: భాగ్యనగరంలో ఆషాడ మాసబోనాలు నగరంలో కన్నుల పండువగా సాగుతున్నాయి. సిటీలో గల్లీగల్లీలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.. ఈనెల 7వ తేదీన గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాళ గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడానికి మహిళలు పెద్ద యెత్తున తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా గోల్కొండ కోట కింద పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు..

Tags:    

Similar News