Nothing: నథింగ్ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది... మరింత ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో

Nothing: నథింగ్ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది... మరింత ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో

Update: 2024-07-21 15:00 GMT

Nothing: నథింగ్ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది... మరింత ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో 

Nothing: లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ బ్రాండ్‌కు మార్కెట్లో ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్రాండ్‌ నుంచి వచ్చిన స్మార్ట్ ఫోన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. ముఖ్యంగా భారత మార్కెట్లో ఈ ఫోన్‌ అమ్మకాలు భారీగా జరిగాయి. దీంతో నథింగ్‌ నుంచి వరుసగా స్మార్ట్‌ఫోన్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నథింగ్ ఫోన్‌2ఏకి కొనసాగింపుగా కొత్త ఫోన్‌ లాంచ్‌ చేస్తోంది.

నథింగ్ ఫోన్‌ 2ఏ ప్లాస్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఈ నెల 31వ తేదీన భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నథింగ్‌ 2ఏ కంటే మంచి ఫీచర్లను ఇందులో తీసుకొస్తున్నారు. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబధించిన పూర్తి వివరాలను ప్రకటించకపోయినప్పటికీ నెట్టింట కొన్ని ఫీచర్లు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఈ ఫోన్ గ్రోవ్స్ తోపాటు బ్లాక్ సర్ఫేస్‌తో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ఫీచర్ల విషయానికొస్తే నథింగ్ ఫోన్‌ 2ఏ స్మార్ట్‌ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ ఈ ఫోన్‌లో అందించారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. అలాగే మరో 50-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ఇక 45 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నట్లు తెలుస్తోంది. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ ధర రూ. 30 వేలలోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News