Team India: ప్రధాని మోడీని కలిసిన టీమిండియా

Team India: టీ20 వరల్డ్‌కప్‌తో సగర్వంగా భారతదేశానికి అడుగుపెట్టిన క్రికెటర్లు ప్రధాని మోడీని కలిశారు.

Update: 2024-07-04 09:33 GMT

Team India: ప్రధాని మోడీని కలిసిన టీమిండియా

Team India: టీ20 వరల్డ్‌కప్‌తో సగర్వంగా భారతదేశానికి అడుగుపెట్టిన క్రికెటర్లు ప్రధాని మోడీని కలిశారు. భారత్‌కు చేరుకున్న వెంటనే... ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లింది టీమిండియా. ప్లేయర్లను సాదరంగా ఆహ్వానించిన ప్రధాని మోడీ.. వారికి అభినందనలు తెలిపారు. వరల్డ్‌కప్‌ టోర్నీలో టీమిండియా జర్నీ గురించిన అనుభవాలు తెలుసుకున్నారు.

అనంతరం ప్రధాని నివాసం నుంచి వారు ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. భారత క్రికెటర్లు నేరుగా ముంబయికి వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు రోడ్‌షో, అనంతరం వాంఖడే వేదికగా సన్మానం జరగనుంది.


Tags:    

Similar News