టోర్నమెంట్లో విషాదం.. బ్యాడ్మింటన్ ఆడుతూ కోర్టులోనే గుండెపోటుతో ప్లేయర్ మృతి
Badminton Player Death: ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నీలో విషాదం చోటుచేసుకుంది.
Badminton Player Death: ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నీలో విషాదం చోటుచేసుకుంది. బ్యాడ్మింటన్ ఆడుతూనే చైనాకు చెందిన 17 ఏళ్ల ఆటగాడు ఝాంగ్ జిజియిూ హార్ట్ ఎటాక్కు గురయ్యాడు. ఆట ప్రారంభమైన కాసేపటికే బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి పోయి మృతి చెందాడు. కోచ్.. తోటి ఆటగాళ్లు వెళ్లి.. చూడగా.. అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనతో చైనా క్రీడా ప్రపంచం శోక సముద్రంలో మునిగిపోయింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాంగ్ జిజీ మరణంపై భారత స్టార్ పీవీ సింధు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ మరణ వార్తతో తన హృదయం ముక్కలైందని ఎక్స్లో సింధు పోస్టు చేసింది.